గ్రేటర్ యుద్ధం :ఫాం హౌస్ కు నిప్పు పెడతాం: ధర్మపురి అరవింద్
కరోనా సమయంలో ఆక్సిజన్ అందక చనిపోయారు అని, ప్రజలకు సరైన వైద్యం అందించలేదు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు అయ్యింది అని ఆయన ప్రశ్నించారు. మా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే 25 వేలు ఇస్తామని ఆయన అన్నారు. జిహెచ్ఎంసి లో బీజేపీ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సుపాస్,మెట్రో పాస్ లను ఉచితంగా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ ని కర్రు కాల్చి బొంద పెడతారు అన్నారు.
కేసీఆర్ బోటిలను కూడా ముంచేస్తారు అని, ఏమి చేసినవు హైదరాబాద్ కు చూపించు ఎందుకు ఇంత అప్పులు చేస్తున్నారు అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పధకాలు చేపట్టిండు అని మండిపడ్డారు. ఎల్ అర్ యెస్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అని విమర్శించారు. అవినీతి రహిత పాలన రావాలంటే బీజేపీ కి ఓటు వేసి గెల్పించండి అన్నారు. మళ్ళీ టిఆర్ఎస్ గెలిపిస్తే ఎల్ ఆర్ యెస్ పేరుతో దోచుకుంటారని విమర్శించారు. మీ పద్దతి మార్చుకోకపోతే మీ ఫామ్ హజ్ కి అగ్గి పెడతాం అని ఆయన హెచ్చరించారు.