కిలాడి లేడి.. కొన్ని రోజులు ప్రియుడితో సుఖం అనుభవించి.. చివరికి ఆ ప్రియుడినే..?
గత నెల 26వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా విచారణ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. వినుకొండ ఉప్పర పాలానికి చెందిన తిరుమల శ్రీను పుల్లలచెరువు పరిసర ప్రాంతాలలో ద్విచక్రవాహనంపై తిరుగుతూ నైటీలు అమ్ముతూ జీవిస్తున్నాడు.. స్థానికంగా ఉన్న ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత మూడు నెలల నుంచి నాగార్జున అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్న సదరు మహిళ శ్రీను ను దూరం పెరుగుతూ వచ్చింది. తీవ్ర ఆగ్రహంతో శ్రీను... నాగార్జున అంకమ్మ వ్యవహారంపై దృష్టి పెట్టాడు.
ఇక ఈ విషయాన్ని గమనించిన అంకమ్మ నాగార్జున కలిసి శ్రీను ను అంతమొందించాలి ప్లాబ్ వేసారు. ఈ క్రమంలోనే నైటీలు కొంటాను అంటూ అంకమ్మ శీనును పిలిపించింది. పుల్లల చెరువు వద్దకు వచ్చిన తర్వాత.. మాటలు కలిపింది.. ప్లాన్ ప్రకారం అక్కడే మాటు వేసి ఉన్న నాగార్జున శ్రీను పై కర్రతో దారుణంగా దాడి చేశాడు. అదే సమయంలో బంగారు గొలుసు ఫోన్ కూడా లాక్కున్నారు అనంతరం మృతదేహాన్ని ఎవరికీ కనబడకుండా పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఇక అనుమానాస్పదస్థితిలో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా ఈ సంచలన నిజాలు బయటపడ్డాయి.