సీఎం జగన్ పై చంద్రబాబు మాటల యుద్ధం.. అసలేం జరిగింది?

Satvika
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.. ఆంధ్రను పట్టి పీడిస్తున్న మహమ్మారి ఎవరో కాదు జగన్ మోహన్ రెడ్డి.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.175 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిలు, టీడీపీ ప్రజా ప్రతినిధులతో మంగళవారం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కరోనాను మించిన వైరస్ జగనేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సంద్భంగా బాబు మాట్లాడుతూ.. కరోనా మించిన వైరస్ జగన్ అని అన్నారు.

అసత్యాలను కూడా నిజాలు అని నమ్మించడంలో జగన్ ఆరితేరాడు.కులం, మతం పేరుతో విద్వేషాలు రగిలించడంలో ఆరితేరినవాడని ఆరోపించారు. పేరుమోసిన క్రిమినల్స్‌తో కేసులు వేయించడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి మంచివాళ్లపై బురద జల్లడం వైసీపీ నాయకులకు సరదాగా మారిందని బాబు మండి పడ్డారు.కేంద్ర మంత్రి పేరుతో మోసగించిన వాడితో కూడా కేసులు వేయిస్తారని ఆరోపించారు. పేకాట దందాలు నడిపేవాడితో కేసులు వేయిస్తారని, క్రిమినల్స్‌ను అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని సీఎం జగన్‌పై చంద్రబాబు  తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


తన ఇంటిని తనకు కాకుండా చేసిన జగన్ కు వ్యతరేకంగా నా ఇల్లు .. నా సొంతం, నా స్థలం.. నాకు ఇవ్వాలి అని నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టాలని బాబు టీడీపీ నేతలకు , కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేద కుటుంబం కల అని, దాన్ని నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. కట్టిన ఇళ్లు ఇస్తే టీడీపీకి మంచిపేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.. డిపాజిట్ కట్టిన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా వైసీపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు సంక్రాంతి ముందుగా పేదలకు ఇల్లు ఇవ్వాలని బాబు డిమాండ్ చేశారు.. నిన్నటి దాకా కుక్కిన పేనులాగా ఉన్న బాబు ఒక్కసారిగా రెచ్చి పోవడంతో రాజకీయ రచ్చలు మళ్లీ ఊపందుకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: