రాజమౌళికి ఆ విషయం పై వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత..

Satvika
రాజమౌళి.. ఈ పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమ లో పరిచయం అక్కర్లేదు.. హిట్ సినిమాలకు కేరాఫ్ ఆయన.. ఆయన సినిమాను నిజ జీవితాన్ని దగ్గర చేసి సినిమాను తీస్తారు.. దాంతో ప్రజలు ఆయన పై ప్రశంసలు కురిపించడమే కాదు.. జక్కన్న హిట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అని పొగడ్తలతో ముంచేసారు.. అది నిజమే అనుకోండి.. ఈయన లాగా సినిమాలు తీసేవాళ్ళు ఇప్పటి వరకు పోటీకి రాలేదు...



బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సినిమాను తీసిన జక్కన్నకు విదేశాల్లో కూడా ఎనలేని గౌరవం దక్కింది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న జక్కన్న ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు .. ఆ సినిమానే ట్రిపుల్ ఆర్ .. ఈ షూటింగ్ ఎప్పుడో మొదలైంది.. ఇద్దరు హీరోలను పెట్టి సినిమాను తీస్తున్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. భారత దేశ చరిత్రను తలపించేలా ఈ సినిమా ఉండనుంది.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఇద్దరి హీరోల టీజర్లను జక్కన్న విడుదల చేశాడు.



అయితే రామ్ చరణ్ టీజర్ ను ప్రేక్షకులు ఆదరించారు. కానీ ఎన్టీఆర్ టీజర్ పై మాత్రం విమర్శలు వెలు వెత్తుతున్నాయి.. చరిత్రను తెలిసి సినిమా తీసింటే బాగుండు అని చరిత్ర ప్రేమికులు మండిపడ్డారు. కాగా, ఇప్పుడు మరో సారి చర్చనీయాంశంగా మారింది.. ఈ సినిమా పై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు తీవ్రంగా మండపడుతున్నారు.. నీకు కాసుల వర్షం కురిపించే దిశగా సినిమాలు చేస్తున్నావ్.. కానీ ఇక్కడ అందరికీ తెలిసిన కథను నీ ఇష్టమొచ్చిన రీతిలో సినిమా తీస్తే థియేటర్లు పగిలిపోయేలా ప్రజలు ఉగ్ర రూపాన్ని దాలుస్తారు వెంటనే సినిమాను నిలిపివేయాలి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ విషయం పై జక్కన్న ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.. ఈ విషయం పై ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: