ప్రజలు అప్రమత్తంగా కండి.. ఆ దొంగతనాలు మళ్లీ మొదలయ్యాయి..?
ఇక ఇప్పుడు మరో సారి ఉల్లి ధరలు అమాంతం పెరిగి పోతున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ఏడాది పెరిగిన ఉల్లి ధరలతో ఇబ్బందులు పడితే మళ్లీ ఉల్లి ధరలు పెరగడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నారు సామాన్య ప్రజలు. కేవలం ఉల్లి ధరలు మాత్రమే కాదు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య సాధారణ కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఉల్లి ధరలు కూడా కొండెక్కడంతో మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఉల్లి ధరలు పెరిగిన సమయంలో నగదు బంగారం కాకుండా ఉల్లి దొంగతనాలు జరగడం చూసాం.
ఇప్పుడు మరోసారి దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఉల్లి దొంగతనాలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధర దాదాపుగా వంద రూపాయలకు చేరింది. ఈ క్రమంలోనే ఇటీవలే మహారాష్ట్రలో ఏకంగా ఐదు వందల యాభై కిలోల ఉల్లి దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారిపోయింది. సంజయ్, పాపాత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.