బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య.... కారణం ఇదేనా...?

Suma Kallamadi
రోజు రోజుకి ఆత్మహత్యలు, హత్యలు ఎక్కడో ఒక చోట జరుగుతున్నదే. తాజాగా మరో వార్త బయట పడింది. బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..... ఊటబావుల పల్లెకు చెందిన సురేష్‌ (32), కృష్ణవేణి (24) భార్య భర్తలు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు వరుణ్‌తేజ్ ‌(6), హర్షిత (3) ఉన్నారు. కూలి పని చేసుకుంటూ బ్రతుకుని నెట్టుకొస్తున్నారు. అయితే ఈ ఇరువురు దంపతులు మధ్య కొంత కాలంగా గొడవలు అయ్యాయి . అందుకే కృష్ణ వేణి మనస్తాపం కి గురై శుక్రవారం సాయంత్రం  ఇద్దరి పిల్లలను వెంట తీసుకుని గ్రామానికి అర కిలో మీటరు దూరం లోని ఉన్న దేవళం గుట్ట పైకి వెళ్లింది. చీర కొంగుకు పిల్లల్ని కట్టేసుకుని కోనేటి లో దూకేందుకు యత్నించింది.
పిల్లవాడు వరుణ్ మాత్రం తన తల్లి కొంగు నుండి విడిపించుకుని వెళ్ళి పోయాడు. వెంటనే  వరుణ్ రా తాత అని గట్టిగా అరిచాడు పరిగెత్తుకుంటూ తన తాత ముని రత్నం వద్దకు వచ్చాడు. అమ్మ, పాప నీటి లో దూకేస్తున్నారు రండి అని గట్టిగా అరుస్తూ అందరినీ పిలిచాడు. ఇలా వరుణ్ పిలవడం తో వరుణ్ వాళ్ళ తాత స్థానికులను, మనవడిని వెంట బెట్టుకొని పరుగున ఆ వృద్ధుడు గ్రామస్తుల తో కలిసి కోనేటి వద్దకు వెళ్లే సరికి  కృష్ణవేణి తన కుమార్తె తో సహా విగతజీవులై  ఉన్నారు.
ఇంకేం చెయ్యలేని పరిస్థితి. అప్పటికే ఆమెని కాపాడ లేకపోయారు. కుటుంబ కలహాల కారణంగా ఈమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఘోరం. ఈ ఘటన నిజంగా స్థానికులను కలచి వేసింది .  పోలీసులు సమాచారం అందుకుని ఆ ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన దానిని పరిశీలిస్తున్నారు. అలానే ఆత్మహత్యకి గల కారణాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: