దిమ్మ తిరిగిపోతోందిగా ప్రపంచవ్యాప్త మరణాలు...దేశంలోని కేసులు ఎన్నంటే...
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటి 80 వేల 224 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. ఇక భారత్ విషయానికి వస్తే, షాకింగ్ లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రమవుతున్నది. కేవలం గత ఆరు రోజుల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారం రికార్డు స్థాయిలో 18,552 కేసులు నమోదుకాగా, 384 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 5 లక్షలు (5,08,953 కేసులు) దాటాయి. మృతుల సంఖ్య 15,685కు చేరుకుంది. 15,000కు పైగా కేసులు నమోదుకావడం వరుసగా ఇది నాలుగో రోజు. దేశంలో లక్ష కేసులు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా, ఆ తర్వాత 39 రోజుల్లోనే అదనంగా 4లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే మన దేశంలో ఈ మహమ్మారి ఉగ్రరూపం తెలుసుకోవచ్చు.
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చడంలో కీలకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మన దేశంలో జూన్ 1 నుంచి 27వ తేదీ మధ్యనే దాదాపు 3,18,418 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,97,387 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే 2,95,880 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రికవరీ రేటు 58.13 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 79,96,707 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది.
దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రుల బృందానికి కేంద్ర వైద్య శాఖ కీలక వివరాలు వివరించింది. దేశంలో కేవలం ఎనిమిది రాష్ర్టాల్లోనే (మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) 85.5 శాతం కేసులు, 87 శాతం మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. రికవరీ, మరణాల శాతం, కేసుల రెట్టింపు, కరోనా పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని మంత్రులకు వివరించింది. ప్రజారోగ్య నిపుణులు, సాంక్రమిక వ్యాధి నిపుణులు, సీనియర్ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారితో కూడిన 15 కేంద్ర బృందాలు కరోనా కట్టడికి ఆయా రాష్ర్టాలకు సహకారం అందిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం మరో కేంద్ర బృందం మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణలలో పర్యటిస్తున్నట్లు పేర్కొంది.
వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 41 లక్షల 21 వేల 17. వ్యాధి నుంచి కోలుకుని 54 లక్షల 57 వేల 945 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 లక్షల ఒక వేయి 262 మంది మృతిచెందారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి.