ఈ కషాయంతో ఐదు రోజుల్లోనే కరోనా మాయం!?

Durga Writes

కరోనా వైరస్..  ప్రపంచాన్ని ఎలా నాశనం చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని హడలెత్తించింది. అలాంటి కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ఎంతోమంది పరిశోధకులు రేయింపగళ్ళు కష్టపడి పరిశోధనలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు. 

 

 

అయితే కరోనా మాయం అవ్వడానికి ఆవు పేడ అని ఒకరు, ఆవు మూత్రం అని ఒకరు, భారతీయ వంటకం మిరియాల రసం అని ఒకరు సోషల్ మీడియాలో కరోనా భారత్ లోకి ప్రవేశించకముందు నుండే ప్రచారాలు చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ కషాయంతో కేవలం ఐదు రోజుల్లోనే కరోనా మాయం అంటూ ప్రచారం జరుగుతుంది. 

 

 

ఆ ప్రచారం ఇలా జరుగుతుంది.. తమిళనాడులోని సిద్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు తాము తయారుచేసిన ''కబాసుర కుడినీర్'' అనే కషాయం కరోనాకు మందుగా పని చేస్తోందని తెలిపారు. వైరల్ ఫీవర్లకు మందుగా పని చేసే ఈ కషాయాన్ని 5రోజులు తాగితే కరోనా రోగులు కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

 

 

ఇప్పటికే రెండు దశల పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ కషాయం.. మూడో దశ పరీక్షలు పూర్తి చేసుకుంటే ఐసిఎంఆర్ అనుమతితో కరోనా రోగులకు దీనిని ఇవ్వవచ్చని డాక్టర్లు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఏది ఏమైనా ఐదు రోజుల్లో కరోనా వైరస్ తగ్గడం అనేది మాములు విషయం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: