వ్యభిచారం పై షాకింగ్ కామెంట్స్ చేసిన బుల్లి తెర యాంకర్..!!!

murali krishna
బుల్లితెరపై యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్ధస్త్ ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై మాత్రం అంతగా రాణించలేకపోయింది.దీంతో మళ్లీ బుల్లితెరవైపు అడుగులు వేసింది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సమాజంలో మూగ జీవాలపై జరుతున్న హింసలపై, అలాగే మహళలపై జరుగుతున్న దాడులపై స్పందిస్తు పోస్ట్ పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.అయితే రష్మి గౌతమ్‌ కి చాలా సామాజిక స్పృహ ఎక్కువ. ముఖ్యంగా ఆమె యానిమల్‌ లవర్‌. డాగ్స్ లవర్‌గా రాణిస్తుంది. ఏ కుక్కకి ఏమైనా తాను తట్టుకోలేదు. మూగ జీవాలపై హింసని ఆమె వ్యతిరేకిస్తూ వస్తుంది. మనుషుల్లాగే వాటిని చూడాలని చెబుతుంది.ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వాటికి సంబంధించిన పోస్ట్ లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే దానిపై కామెంట్‌ చేస్తూ చర్చకి తెరలేపుతుంది. ఇష్యూ రైజ్‌ చేస్తూ తనవంతుగా సామాజిక బాధ్యతని చాటుకుంటుంది రష్మి గౌతమ్‌. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌ అవుతుంది. మహిళ, సెక్స్ అనే అంశాలకు సంబంధించిన రష్మి పోస్ట్ ఆలోచింప చేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో దీన్ని పంచుకుంది రష్మి.'మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్‌ పెట్టాలి. కానీ 'డిక్‌' కాదు. అని ప్రముఖ రైటర్‌ రచెల్‌ మోరన్‌ రాసిన కోట్‌ని.. మరో రైటర్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ని రష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్‌ చేసింది. దీంతో పాటు 'చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం అనేదే ఉండదు. దాని మనుగడ కూడా ఉండదు' అంటూ ఓ వేశ్య చెప్పిన డైలాగును సైతం షేర్ చేసింది రష్మి. ప్రస్తుతం ఈ పోస్ట్ దేని గురించి పెట్టిందా అంటూ.. నెట్టింట హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: