కలిసి జీవించలేక తనువు చాలించారు...చూస్తే కన్నీళ్లు ఆగవు...
ప్రేమించడం అంటే ప్రేమను ప్రేమ గా సాధించుకోవడం.. అప్పుడు ఆ బంధానికి గౌరవం లభిస్తుంది..ఇకపోతే ఒక మనసు కు మరో మనసు సంతోషాన్ని కోరుకుంటుంది.. నిజమైన ప్రేమ ఎప్పుడు విడిపోడు అని చాలా మంది అనుకుంటారు..అది నిజమే ప్రేమ జీవితం లో ఒకసారే ఒకరి మీద మాత్రమే పుడుతుందని కవులు కూడా వర్ణిస్తున్నారు..ఇకపోతే ఇక్కడ ఇద్దరు ప్రేమికులు కలిసి జీవితాంతం అనుకుంటారు.. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోతారు...
వివరాల్లోకి వెళితే...విశాఖపట్నం లో విషాద ఘటన చోటు చేసుకుంది. క్షణి కావేశం లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ గొడవ పడ్డారు. ఆ వివాదం చినికి చినికి గాలి వానగా మారడం తో మనస్థాపానికి గురైన ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా నీవు లేనిదే నేనే లేనంటూ సూసైడ్ చేసుకున్న ఘటన కలకం రేపుతుంది.
విశాఖలోని గోపాలపట్నంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మక్కా శిరీష, కంచర పాలేనికి చెందిన వెంకట్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. సెల్ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇద్దరూ గొడవ పడ్డారు. వివాదం తీవ్రం కావడం తో మనస్థాపానికి గురైన శిరీష ఇంట్లో పై అంతస్తు లోని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది.
శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న వెంకట్.. ప్రియురాలు లేని జీవితం వ్యర్థమంటూ కంచరపాలెం లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతబ్దేహాలను పోస్టు మార్టం కోసం కేజీహెచ్ మార్చురి కీ తరలించారు. ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబా ల్లో విషాదం నెలకొంది. ఒక్క మాట పెద్దలకు చెప్పి ఉంటే బాగుండేదని పలువురు అనుకున్నారు...ప్రస్తుతం ఈ సంఘటన అందరినీ కదిలించి వేస్తుంది...