ఈ కాటు... నరకానికి రూటు...
ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త వైరస్ ఎటాక్ అవుతూనే ఉన్నది. సార్స్, ఆంత్రాక్స్, ఇప్పుడు కరోనా. ఇలా ఎన్నో రకాల వైరస్ లు మనుషులకు ఎటాక్ అవుతూనే ఉన్నాయి. వీటి వలన ప్రజలు మరణిస్తూనే. బ్యాక్టీరియా వలన పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ, వైరస్ వలన సోకే జబ్బుల వలన మాత్రం మనిషి క్షిణించిపోతాడు. అతని శరీరంలోని నిర్మాణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా మనిషి మృత్యువాత పడుతుంటాడు. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది.
మనిషి తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. మనిషి విపరీత పోకడలే ఇందుకు కారణం. ప్రకృతి సమతుల్యత లోపం కారణంగా కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే వీటి నుంచి బయటపడేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇలానే జరుగుతున్నది. ఇక ఇదిలా ఉంటె, ఇంకా అనేక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. రీసెంట్ గా చైనాలోనే వుహాన్ నగరం నుంచి కొత్తగా ఓ వైరస్ పుట్టుకొచ్చింది. అదే కరోనా వైరస్.
దీని వలన వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 17 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా అనేకమంది మృత్యువాత పడే అవకాశం ఉన్నది. మృత్యువు ప్రతి ఒక్కరిని భయపెడుతూనే ఉన్నది. ఈ మృత్యువు వలన కలిగే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. ఇంకా అనేక ఇబ్బందులు వస్తుంటాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయాన్ని కలిగిస్తోంది. భయానకమైన ఇబ్బందులు పెడుతున్నది.
భయాన్ని కలిగించే ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు, ఎప్పటి కప్పుడు వీటికోసం మందులు కనిపెడుతూనే ఉన్నారు. ఆ మందులు ఎంతవరకు పనిచేస్తాయి అన్నది చూడాలి. మందులు పనిచేయలేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి? అనే విషయాలపై కూడా ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ వైరస్ విష సర్పాలయిన క్రైట్, కోబ్రాల వలన వస్తున్నది అన్నది ప్రాధమికంగా తేలింది. దీనిపై ఇంకా లోతైన పరిశోధన చేయాల్సి ఉన్నది. చైనా మనకు పక్కనే ఉన్నది. ఇప్పుడు ఈ వైరస్ మనదేశంలోకి కనుక ప్రవేశిస్తే దాని వలన కలిగే ఇబ్బందులు అందరికి తెలిసిందే.