నేడు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు..
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రత్యేకంగా వేర్వేరు బోర్డుల ఏర్పాటు, మద్యం అక్రమాలపై కఠిన చర్యలతో పాటు పలు రంగాలకు చెందిన 11 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై సోమవారం సభలో చర్చించి ఆమోదించనున్నారు.
ఈ అంశాలపై కూడా బిల్లులు..
►మద్యం ముట్టుకుంటే షాక్ తగిలేలా అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎక్సైజ్ చట్టంలో సవరణలు.
► వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటుకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చట్టంలో సవరణ.
► కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీల చట్టంలో సవరణ.
►ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తిని అన్ని యూనివర్సిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టంలో సవరణ.
►ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టంలో సవరణ.
► ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ చట్టంలో సవరణ.
►ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21–ఎ (1) (ఇ) సవరణ.
ఇప్పటికే ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ల బిల్లులపై చర్చ
* కాఫీ, టీ బోర్డు తరహాలో చిరు, పప్పు ధాన్యాల బోర్డులు
* ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం
* అక్రమంగా మద్యం విక్రయం, రవాణాపై కఠిన చర్యలు
* మద్యంపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధింపు
* మార్కెట్ కమిటీల పునర్వ్యవస్థీకరణ
* కొత్తగా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్
* అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు
* యూనివర్సిటీల చట్టంలో పలు సవరణలు