పిల్లలి కోసం కొత్త స్లోగన్ తీసుకోని వచ్చిన జగన్
దేశంలోనే ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ దానికి సంబంధించిన జీవో పాస్ అయిన నాటి నుంచి టీడీపీలో కలవరం మొదలైంది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టకుండా ఉండాలని ఈనాడు పేపర్లో వరుస కథనాలు ప్రచురించారు. వరుసపెట్టి ఈనాడు పత్రికలో మొదటి పేజీలో బ్యానర్ స్టోరీలు ప్రచురించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో తండ్రీకొడుకులు వరుసపెట్టి వార్తలు రాయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకున్నాడు. నవంబర్ 22న ఆంధ్రం ఆంగ్లం రెండూ అవసరమే అంటూ మాట మార్చారు.
గత ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ఇంగ్లిష్ మీడియం తీసుకురాలేకపోయాడు. 66% గవర్నమెంట్ స్కూళ్లలో ఇప్పటికీ తెలుగు మీడియం కొనసాగుతున్నాయి. అదే ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చూసుకుంటే కేవలం 28% స్కూళ్లలోనే ఇంగ్లిష్ మీడియం బోధన చేస్తున్నారు. కానీ ప్రైవేటు స్కూళ్లు లెక్కలు చూస్తే 94 శాతం ఇంగ్లిష్ బోధన చేస్తున్నాయి.
తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్, అచ్చెన్నాయుడు కొడుకు ఇంగ్లిష్ మీడియంలో చదవలేదా అని {{RelevantDataTitle}}