వైఎస్ పథకాలకు తూట్లు పొడిచిన బాబు : జగన్
కానీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైఎస్ పథకాలకు తూట్లు పొడిచారని సామాన్యుల బతుకులను రోడ్డున పడేశారని నిరుపేద జీవితాలకు విద్యను.. వైద్యాన్ని తన బినామీల కోసం దూరం చేశారని కేవలం దోచుకోవడానికే అన్నట్టుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని రాష్ట్రాన్ని అన్ని విధాలా బ్రష్టు పట్టించారు అని చంద్రబాబుపై మరియు టిడిపి ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు జగన్.
ఇదే క్రమంలో రాబోతున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నవరత్నాలు రాష్ట్రంలో ఉన్న పేద వారి జీవితాలలో వెలుగులు నింపుతాయి అని వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడే విధంగా ప్రభుత్వ పథకాలు ఉంటాయని రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాబోతున్న పరిపాలన ఉంటుందని వైసిపి పార్టీ పేదల మనసులను అర్థం చేసుకునే పార్టీ అని పాదయాత్రలో పేదల జీవితాలను దగ్గరగా చూశాను అని కచ్చితంగా పేదల జీవితాల్లో నవరత్నాలు వైసీపీ పార్టీ పథకాలు అన్ని మేలు చేస్తాయని స్పష్టం చేశారు జగన్.