సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న అడ్డంగా బుక్ అయిన మంత్రి!
ఈ మధ్యన ప్రజా ప్రతినిధులు వెరైటీగా ప్రవర్తిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న విషయాన్ని మైండ్లో పెట్టుకున్న నాయకులు అధికారం ఉంది కదా అని ధర్పం వెలగబెడుతున్నారు. కిందస్థాయి సిబ్బందితో పనికిమాలని అన్ని పనులు చేయిస్తున్నారు. తాజాగా యూపీ మంత్రి ఇలాంటి నిర్వాకమే వెలగబెట్టారు. తన చెప్పుల్ని సిబ్బందితో తుడిపించుకున్నారు. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
తన చెప్పులను ఎవ్వరూ తుడవలేదనీ, తానే శుభ్రం చేసుకున్నానని వివరణ ఇచ్చారు. యూపీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్ లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది ఎరుపురంగు టవల్ తో శుభ్రం చేశారు. దీనిపై జర్నలిస్టులు ప్రశ్నలు అడగడంతో.. మంత్రి నీళ్లు నమిలారు. నా చెప్పులు ఎవరూ శుభ్రం చేయలేదంటూ.. చెప్పుకొచ్చారు.
అయితే అధికారులు మాత్రం ఇవన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేశారు.మంత్రి ప్రతాప్ సింగ్కు వత్తాసు పలికారు. ఆయన చెప్పుల్ని మంత్రిగారే స్వయంగా శుభ్రం చేసుకున్నారన్నారు. ఈ తతంగాన్ని అక్కడున్న జర్నలిస్టులు ఈ ఫోటోలు తీయడంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓ మంత్రి అయ్యుంటి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.