ట్విట్టర్ అకౌంట్ లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ ఇచ్చే ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

KSK
జనసేన పార్టీ తరపున ప్రజాపోరాట యాత్ర చేస్తూ అధికార పార్టీ టిడిపి కి నిద్ర లేకుండా చేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వం పై చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.


ఇటీవల సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న అక్రమ కార్యక్రమాలను బయట పెడుతూ అవినీతిని బట్టబయలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు ఊపిరాడకుండా చేస్తున్న పవన్..తాజాగా సోషల్ మీడియాలో వరుస కామెంట్లతో చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


శ్రీకాకుళం జిల్లా లో వచ్చిన తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటించి తెలుగుదేశం పార్టీ నాయకులను ఏకిపారేసిన పవన్ ఆ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకానొక సమయంలో నారా లోకేష్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీపై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఎకౌంట్లో  ”నీరు కలుషితం అయితే చేపలు శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడతాయి అదే విధంగా ప్రభుత్వం కఠినంగా మారితే ప్రజలు తిరగబడతారు” అని టీడీపీ ని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు.


తాజాగా పవన్ కళ్యాణ్ పెట్టిన కామెంట్ కి సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి ఊహించని రీతిలో మద్దతు వస్తోంది. ఈసారి వస్తున్నా ఎన్నికల్లో నీటిని కలుషితం చేసిన తెలుగుదేశం పార్టీకి చేపలు గట్టిగానే బుద్ధి చెబుతాయని కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: