పవన్ దూకుడు... టీడీపీ మీడియా కూడా ఏం చేయ లేకపోతోంది...!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ విమర్శలు కు టీడీపీ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. పవన్ కళ్యాణ్ మాటల తూటాలు బాబు కు మరియు అతని కొడుకు అయినా లోకేష్ కు సూటిగా దిగుతున్నాయి. అయితే మొన్నటివరకు జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతుంటే ఇప్పడూ పవన్ కళ్యాణ్ దాడి ఎక్కువైందని టీడీపీ లో చర్చలు మొదలయినాయి. అయితే పవన్ కళ్యాణ్ లోకేష్ మీద చేసిన విమర్శలు కు టీడీపీ దగ్గర సమాధానమే లేదు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నేరుగా ఆయా ప్రదేశాలకు వెళ్ళి టీడిపి ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. 


ఉత్తరాంధ్రలో గిరిజనుల వెనకబాటు తనానికి కారణం టీడీపీయేనంటూ మండిపడ్డారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను కలసి, ప్రభుత్వం సర్వేలతో సరిపెట్టిందని సమస్యను పరిష్కరించే ఉద్దేశం వారికి లేదని ప్రజలకు వివరించారు. వారికోసం దీక్షకూడా చేశారు. ఇక గోదావరి జిల్లాల్లో ప్రజలు టీడీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టినా ఫలితంలేదని, ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పారు. 


మొత్తమ్మీద ప్రభుత్వ వైఫల్యాలన్నిటినీ పవన్ తనకి అనుకూలంగా మార్చుకోవడంతో పాటు, ప్రతి ప్రాంతానికి వెళ్లి బాధితులను, అభివృద్ధి ఫలాలను అందుకోలేని వర్గాలను తమవైపు తిప్పుకుంటున్నారు. ప్రభుత్వ తప్పిదాలను వారి అనుకూల మీడియా ఎంత తక్కువచేసి చూపుతున్నా పవన్ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ స్థానికులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకంచేసి టీడీపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: