నేను జనాన్ని రెచ్చగొడితే...చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది: పవన్ కళ్యాణ్

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో ప్రజలతో మమేకమవుతూ తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఇటీవల విజయనగరం జిల్లాలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పై ఆ పార్టీ ఎమ్మెల్యేలపై నాయకులపై తీవ్రమైన విమర్శలు చేశారు అన్యాయానికి గురై నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుతింటున్నారని ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులను అవినీతి చేస్తున్న వారిని అరికట్టాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపితే తాను బిజెపి ఇస్తున్న స్క్రిప్టు చదువుతున్నానని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నానని అంటున్నారన్నారు. నిజానికి తాను గత ఎన్నికల్లో వారి పార్టీకి ఏమి ఆశించకుండా మద్దతు పలికానని, కాకపోతే ప్రజాసమస్యలను పట్టించుకోకపోవటంవల్లే తాను ప్రస్తుతం టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

అసలు తనకు బిజెపి నేతలు స్క్రిప్టు ఇస్తే చదవాల్సిన గతి పట్టలేదని, తన పక్షం ప్రజా పక్షమని, కేవలం ప్రజలకోసమే గొంతెత్తి మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేసారు. నేను అభివృద్ధిని ఆటంకపరిచే వాడినైతే గత ఎన్నికలలో మీకు మద్దతు తెలిపే వాడిని కాదు అంటూ పేర్కొన్నారు... అయితే చివరాకరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు అవినీతి చేస్తున్నారో ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకునే మనిషిని కాదని పేర్కొన్నాడు పవన్.. గట్టిగా ప్రశ్నిస్తే ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై పవన్ తీవ్రంగా స్పందించారు.. నేను గాని ప్రజలను రెచ్చగొడితే ప్రభుత్వాలు కూలిపోతాయి అంటూ చంద్రబాబు ప్రభుత్వం పై  తీవ్రంగా ప్రతిస్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: