ఆ ఒక్క డైలాగ్ తో.. బాబు పదవి కోల్పోవడం ఖాయమేనా..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు బాగా ఫలిస్తాయి. మరికొన్ని బెడిసి కొడతాయి.  ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు పన్నిన వ్యూహం.. మొత్తం పార్టీ భవిష్యత్తుకే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోవచ్చేమో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్నాయి. బీజేపీ పొత్తు వద్దంటోందని.. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన పార్టీ అని.. ఇక మిగిలింది టీఆర్ ఎస్ యేనని ఆయన కామెంట్ చేశారు. 



ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చంద్రబాబుకు తీవ్రంగా నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ అంటే ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. అందులోనూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నామ్ కే వాస్తే అయిన సంగతి కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ పార్టీ బతికినా బతకకపోయినా వచ్చిన నష్టం కూడా ఏమీ కనిపించడం లేదు. 



అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు వ్యాఖ్యల ద్వారా ఏపీలో తెలుగుదేశం పార్టీకి చాలా చిక్కులు వచ్చేలా ఉన్నాయి. అసలే వచ్చే ఎన్నికల్లో పోరు హోరాహోరాగా ఉండబోతోంది. అందులోనూ ప్రత్యేక హోదా సాధించనిపార్టీగా.. కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక సాయం పొందలేని చేతగాని సర్కార్ గా ఇప్పటికే అప్రదిష్ట మూటగట్టుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఏపీలో ఎదురు దెబ్బ ఖాయం కావచ్చు. అది చంద్రబాబు కుర్చీకే ఎసరు తెచ్చేప్రమాదం లేకపోలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: