థాంక్యూ జగన్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మీద రెస్పాండ్ అయ్యావ్ అంటున్నారు ..

KSK
వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత అయినా జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర  పాదయాత్ర అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం  వరకు చేరింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాతూ రాబోయే ఎన్నికలలోముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని  నమ్మవద్దని ఆయనకు ఓటు వేయకండి అంటూ హితవు పలికారు.

ఓట్లు అడిగే పరిస్థితి లో చంద్రబాబు నాయుడు కూడా లేదని. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని ఈ చంద్రబాబు ప్రజలలోకి వచ్చే ధైర్యం లేదన్నారు. ఈ క్రమంలో ఆయన సినిమా  యాక్టర్ ను పంపి తనకు ఓట్లు అడిగిస్తాడు.

చంద్రబాబుకు ఓటేయండి. నాది పూచి అని ఓ యాక్టర్ వచ్చి అడుగుతాడు అంటూ జగన్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అన్నారు. అలాంటి హీరోను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేని నాయకుడు రాజీనామా చేసే పరిస్థితి రావాలని అన్నారు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ విషయం లో సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పటికైనా రియాక్ట్ అయినందుకు సంతోషం అంటున్నారు వైకాపా శ్రేణులు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: