ఆళ్లగడ్డ లో పోటీ చేయకపోవడమే బెటర్-టిడిపి

Chowdary Sirisha
తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేయకపోవచ్చు. ఈ మేరకు కధనాలు వస్తున్నాయి.ముఖ్యమంత్రి , టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. నందిగామలో మరణించిన ఎమ్మెల్యేకి సానుభూతిగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పోటీచేయని నేపధ్యంలో ఆళ్లగడ్డలో టిడిపి కూడా సిటింగ్ ఎమ్మెల్యే శోభ మరణం కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీచేయకపోవడమే బెటర్ అన్న అబిప్రాయం ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు.దానికి తోడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా అదే అబిప్రాయం వ్యక్తం చేశారు.అందువల్ల టిడిపి పోటీచేయకపోవచ్చు.తుది నిర్ణయం సోమవారం తీసుకుంటారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: