షర్మిల: అన్నని కాకుండా వదినను టార్గెట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఉంది.. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ కూడా వైయస్సార్ కుమారుడు కావడంతో ఆయనకు మరింత ప్రజాదారణ పెరిగింది. అయితే గత కొద్ది రోజులుగా జగన్ ఆమె చెల్లెలు షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇటీవల షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొని అందరి పైన విరుచుకుపడుతోంది. ఇప్పుడు తాజాగా వదిన మరదళ్ల గొడవ రోడ్ ఎక్కేసినట్టుగా కనిపిస్తోంది.

తాజాగా డైరెక్ట్ గా భారతిని టార్గెట్ చేస్తూ మాజీమంత్రి వివేక హత్య కేసులో గుండెపోటుగా ప్రసారం చేసింది ఛానల్ నడిపించే సీఎం జగన్ భార్య భారతి అంటూ షర్మిల తెలియజేస్తోంది. అలా ప్రసారం చేయడానికి గల కారణాలు ఏంటినే విషయాలు చెప్పకపోవడం ఏంటా అంటూ ప్రశ్నిస్తోంది షర్మిల. వైయస్సార్ జిల్లా కమలాపురం జిల్లా  నియోజవర్గం లోని పలు మండలాలలో పర్యటిస్తూ మంగళవారం రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా పదేపదే భారతి పేరును కూడా ప్రస్తావిస్తూ వస్తోంది షర్మిల.

దీన్ని బట్టి చూస్తే వైయస్ భారతి రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటోంది షర్మిల. ఇక్కడ వదిన మరదళ్ల పడవే.. అంతా అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. ఆస్తిపరంగా కానీ కుటుంబ పరంగా గానే పుట్టింటి మీద ఆధిపత్యం కోరుకున్నటువంటి షర్మిల వ్యవహారానికి అక్కడ వదిన అడ్డుపడటం వలన ఎదురవుతున్నటువంటి వ్యవహారం అన్నట్టుగా కనపడుతోంది.. ఇది ఓపెన్ అయిపోయి రాజకీయ హత్య నేరాలు రాజకీయాలు అన్నిట్లో కూడా దుఃఖించేస్తోంది షర్మిల. మరి ఇది ఏ మేరకు ప్రయోజనమో నష్టమో తన భవిష్యత్తుతే తేల్చాల్సి ఉంది. గత కొద్ది రోజుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం పైన అవినాష్ రెడ్డి ముద్దాయి అంటూ గత కొన్నేళ్ల నుంచి సునీత, షర్మిల పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఈసారి కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: