డబ్బులను పొదుపు చెయ్యడానికి ఎన్నో రకాల స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.అందులో ఎక్కువగా పోస్టాఫీసు స్కీమ్ లు ఉన్నాయి.ఇందులో వుండే పథకాల లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభలను పొందవచ్చు..కొన్ని పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం అంటున్నారు నిపుణులు.
మీరు డబ్బులు ఇన్వెస్ట్ చెస్తె.. 124 నెలల్లో రెట్టింపు అయ్యే పథకం ఉంది. దీని వల్ల మంచి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం దక్కించుకోవచ్చు. ఈ పథకం ఏంటంటే.. కిసాన్ వికాస్ పత్ర. ఇందులో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టి రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు డబ్బులు పెట్టిన 10 సంవత్సరాల 4 నెలల్లో డబుల్ అవుతుంది. అంటే ఉదాహరణకు 1 లక్ష డబ్బులను పెట్టుబడి పెడితే 2 లక్షల రూపాయలు అవుతుంది. ఈ స్కీమ్లో కనీసం రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టాలి. లిమిట్ అంటూ ఏమి లేదు..
ఈ పథకంలో చేరాలంటే కనీసం వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ వయస్సు వారే ఈ స్కీమ్లో చేరేందుకు అర్హులు. అంటే రూ.1000, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.50 వేలు ఇలా మీకు నచ్చిన మొత్తంలో కిసాన్ వికాస్ పత్రాలను కొనుగోలు చేయవచ్చు.ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటు మారుతూ ఉండవచ్చు. వడ్డీ రేట్లు కూడా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి.
ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చెయ్యాలని భావించేవారు సింగిల్, జాయింట్లో ఏదైనా ఖాతా తీయవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు మనుషులు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. పిల్లల పేరిట ఖాతా ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.ఈ స్కీమ్లో చేరాలంటే పోస్టాఫీసులో ఖాతా తీయవచ్చు.. ఇందుకోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరి. ఈ స్కీమ్లో నామినీ ఎంపిక కూడా తప్పనిసరిగా ఉంటుంది.ఈ డబ్బులను పోస్టాఫీసు కు వెళ్ళి మాత్రమే విత్ డ్రా చేసుకొవాలి.