కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అయిన టు వంటి పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలినట్లు సమాచారం అందుతోంది. గుడివాడ లో జి 3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో ఇవాళ్టి రోజున పాల్గొన్నారు మంత్రులు కొడాలి నాని మరియు పేర్ని నాని. అయితే... ప్రారంభ చిత్రంగా థియేటర్లో భీమ్లా నాయక్ ప్రదర్శన జరిగిందని సమాచారం.. ఇలాంటి తరుణంలో.... థియేటర్ వద్ద మంత్రి పేర్ని నానిను అడ్డుకునేందుకు ప్రయత్నించేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు మరియు ఇతర కార్యకర్తలు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు మరియు ఇతర కార్యకర్తలు. ఇలాంటి తరుణంలోనే... గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ , పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం అన్యాయం జనసేన పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా... మీడియాతో ఏపి ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వి ప్రసాద్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు... థియేటర్ల వ్యవస్థ మీద దాడి చాలా కలిచివేస్తోంది...తమిళనాడు నుంచి ఎంతో కష్టపడి ఇక్కడకు తీసుకువచ్చామన్నారు ఎన్వి ప్రసాద్. థియేటర్ల వ్యవస్థ పై ఇది దాడి...ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు ఎన్వి ప్రసాద్. ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించాము. మంత్రి నానిని కలిసి మా బాధలు చాలా సార్లు చెప్పాము... కరోనా నుంచి రికవరీ అవుతుండగా, ఇప్పుడు మళ్లీ ఇలా దాడి చేస్తున్నారన్నారు ఎన్వి ప్రసాద్.