కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో ని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర రెడ్డి.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. హుజూరాబాద్ లో బిజెపి నాయకులు టీఆరెఎస్ కారుకర్తలను రెచ్చగొట్టి కయ్యానికి దిగుతున్నారని ఫైర్ అయ్యారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ఇట్టి విషయం పై ఎన్నికల కమిషన్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని స్పష్టం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కమాలపూర్ లో జరిగిన ఆక్సిడెంట్ విషయం లో టీఆరెఎస్ పార్టీని తప్పు పట్టే ప్రయత్నం చేశారని చెప్పారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇల్లందకుంట మండలం సిరిసెడ్ లో కూడా టీఆరెఎస్ కార్యాలయం ముందు నానా హంగామా చేశారని... బిజెపి గుండాల దగ్గర నుండి టీఆరెఎస్ కు రక్షణ కావాలని ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎన్నికల ముందు బిజెపి నాయకులు ఎన్నికల డ్రామాలు కూడా చేస్తారని తెలిపారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ఈ నెల 27 న ఈటల రాజేం దర్ అతని భా ర్య సొమ్మ సిల్లి పడిపోయి డ్రా మా లతో లబ్ది పొందాలని చిల్లర డ్రామాలు చేసే ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం ఉందని పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చే శారు. ఆరో గ్యం బా గా లేని వారిని ఆత్మహత్య యత్నం చేసే అవ కా శం కూ డా ఉందని చెప్పారని... హుజూరాబాద్ లో టీఆరెఎస్ పార్టీ అద్భుత విజయం సాధించ బోతుం దని ప్రకటించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఏది ఏమైనా... హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ ని గెలిపించాలని పిలుపు ని చ్చారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.