జగన్ సొంత నియోజకవర్గంలో ఇంత దారుణాలా...?
దేశంలో ఎక్కడైనా అరటి కేజీ రూ. 4 కి, టమెటా రూ.1కి, చినీ కేజీ రూ. 15 కి దొరుకుతుందా? ఈ ధరలు దేశంలో ఒక్క పులివెందులలో మాత్రమే ఉన్నాయి అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో దళారులతో వైసీపీ నేతలు కుమ్మక్కయి రైతులను దోచుకుంటున్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు అని విమర్శలు చేసారు. వైసీపీ పాలనలో పంట వేయడానికి పెట్టుబడికి అరువు పుట్టక కరువుకు పంటలు సరిగా పండక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నారు.
విత్తనం నాటిన రైతు ఆ పంటను విక్రయించే నాటికి ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు అని విమర్శించారు ఆయన. ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగిన జగన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాల్ని ఎందుకు పరామర్శించ లేదు? అని బీటెక్ రవి నిలదీశారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు ఏం చేశామో, వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో మీరేం చేశారో బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్దమా? అంటూ ఆయన సవాల్ చేసారు.