ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త ఏడాది కానుక.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..?
ఒకవేళ ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లాలి అన్న కూడా ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోవాల్సి వచ్చేది.. కానీ ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం బస్సు పాస్ సౌకర్యం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే తమకు కూడా బస్సు పాస్ సౌకర్యం వస్తే ఎంత బాగుండు అని కోరుకోని ఔట్సోర్సింగ్ ఉద్యోగి లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే జగన్మోహన్రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా శుభ వార్త చెప్పింది. డిసెంబర్ నెలలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా ఉచిత బస్ పాస్ అందించాలని నిర్ణయించింది.
ఇటీవలే ఈ ఏడాది నూతన సంవత్సర కానుకగా రోడ్డు రవాణా సంస్థ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ఉచితంగా బస్ పాస్ ల పంపిణీ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ కూడా ఉచిత బస్ పాస్ లు అందజేశారు. ఉచిత బస్సు పాసులతో రోడ్డు రవాణా సంస్థ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇంటి నుంచి దాదాపు 25 కిలోమీటర్ల మేర వర్తిస్తాయి. ఇక ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ ఉచిత బస్సు పాస్ లతో 5000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి పొందినున్నట్లు తెలుస్తోంది.