చీ..చీ..వీడు అసలు మనిషేనా..!

Edari Rama Krishna
దేశంలో ఈ మద్య మంచితనం మంట కలిసి పోతుంది..సంబందబాంధవ్యాలకు చోటులేకుండా పోతుంది. క్షణికావేశం, డబ్బు ై వ్యామోహం మనిషిని ఎంతపనైనా చేసేలా చేస్తుంది.  తాజాగా హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురైన వార్తతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మృతదేహాలను నిందితుడు కారులో తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చైతన్యపురిలో జరిగిందీ ఘటన.  తమ ఈడు ఉన్న తోటి పిల్లలకు భిన్నంగా తమదైన లోకంలో ఉండే కవలల్ని దారుణంగా హతమార్చిన వైనం షాకింగ్ గా మారింది.

మంచి మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఈ ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అనకుండా ఉండలేరు. ఇంతకీ ఈ జంట హత్యల్ని చేసింది ఎవరో కాదు.. పిల్లల మేనమామే! పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు 12 ఏళ్ల వయసున్న సృజనరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి అనే కవలలున్నారు. వీరిద్దరూ మానసిక వికలాంగులు కావడంతో వారిని ఎలాగైనా వదిలించుకోవాలని వారి మేనమామ మల్లికార్జునరెడ్డి ప్లాన్ వేశాడు.

 సిటీలోని చైతన్యపురి సత్యానారాయణపురంలోని ఇంటికి పిల్లల్ని తీసుకొచ్చిన కసాయి.. పిల్లల్ని దారుణంగా హతమార్చాడు. అనంతరం వారిని కారులోకి తీసుకెళ్లి.. గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేశాడు. పిల్లల్ని హతమార్చిన వైనంపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారులో తరలిస్తున్న చిన్నారుల మృతదేహాలతో పాటు.. ఈ ఘాతుకానికి పాల్పడిన మల్లికార్జునరెడ్డిని అతనికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఉదంతానికి సంబంధించి నిందితుడు పోలీసులకు ఏం చెప్పాడన్నది బయటకు రావాల్సి ఉంది. చిన్నారుల మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: