రష్యా యుద్ధం.. 137 మంది మృతి?

praveen
తమకు ఉక్రెయిన్ పై యుద్ధం చేసే ఉద్దేశ్యం లేదని.. కానీ ఉక్రెయిన్ కావాలని యుద్ధం కొని తెచ్చుకునే విధంగా వ్యవహరిస్తోంది అంటూ గతంలో స్టేట్మెంట్ ఇచ్చింది రష్యా. ఇక సరిహద్దులో సైనికులను ఉపసంహరించుకున్నాము అంటూ ఎన్నో మాయమాటలు కూడా చెప్పింది. కానీ ఉక్రెయిన్ పై రష్యా ఏక్షణంలోనైనా దాడులు చేసే అవకాశం ఉంది అంటూ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. చివరికి అనుకున్నదే జరిగింది అగ్ర దేశమైన రష్యా దేశమైన రష్యాఉక్రెయిన్ పై యుద్ధానికి సిద్ధమైంది. కేవలం మిలిటరీ యాక్షన్ మాత్రమే అంటూ చెప్పిన రష్యా ఇక ప్రస్తుతం యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దింపి  ఎడతెరిపి లేకుండా దాడులకు పాల్పడుతోంది.

 ఇక మొదటి రోజు ఉక్రెయిన్ లో ఉన్న కీలకమైన సైనిక స్థావరాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేయడానికి యుద్ధ విమానాలతో పాటు ఇక భారీగా క్షిపణులను కూడా ప్రయోగించి మారణహోమం సృష్టించింది రష్యా. ఇక నేడు అటు ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ నగరం ను టార్గెట్గా చేసుకుంటూ ఇక మిస్సైల్ తో విరుచుకు పడుతుంది అన్నది తెలుస్తుంది. ఏకంగా జనావాసాల పై దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఉక్రెయిన్ లో ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. అయితే నిన్న ఉక్రెయిన్ సైనిక వైమానిక స్థావరాలను లక్ష్యంగా దాడులకు పాల్పడిన రష్యా 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

 ఇక ఇందులో ఏకంగా 137 మందికిపైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యాయ్. చిన్న దేశం అని కూడా చూడకుండా రష్యా భీకరమైన దాడులు చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్ బలాగాలు సైనిక సమీకరణకు అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇక రానున్న 90 రోజుల పాటు అమలులో ఇవి ఉండబోతున్నాయి అంటూ తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఈ క్రమంలోనే రష్యా ఎక్కడా వెనక్కి తగ్గకుండా దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లోపరిస్థితులు ఎక్కడ వరకు దారి తీస్తాయి అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: