నిర్మాతలకి షాక్ ఇచ్చింది

E. Rama Krishna

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ హవా నడుస్తోంది. కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ సుందరి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం రవితేజ, రామ్‌చరణ్ తాజా చిత్రాల్లో ఈ వయ్యారి నటిస్తున్న విషయం తెలిసిందే.


సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్


ఈ సినిమాలతో పాటు సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న నాన్నకు...ప్రేమతో, శ్రీకాంత్ అడ్డాల నిర్ధేశకత్వంలో మహేష్‌బాబు నటించనున్న బ్రహ్మోత్సవం చిత్రంలో హీరోయిన్‌గా ఖరారైంది. కాగా ఈ సుందరి తాజాగా నితిన్ సరసన నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది.


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను కథానాయికగా


మల్లిడి వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది. సినిమాకు రకుల్ కోటి డిమాండ్ చేసినట్టు చిత్ర వర్గాల సమాచారం.


దీంతో నిర్మాతలు రకుల్ ప్రీత్ సింగ్ డేట్స్ అడాగాలంటే భయపడుతున్నట్టు తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో పారితోషికం విషయంలో ఎలాంటి షరతులు విధించని రకుల్...నితిన్ చిత్రానికి కోటి డిమాండ్ చేసి మరీ సాధించుకుందని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: