సౌందర్య ఆస్తి గొడవలు

HANUMA HANUMA
 సౌందర్య చనిపోయి దాదాపు దశాబ్దం కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో ఆస్తి గొడవలు చెలరేగాయి. బీజేపీ కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. సౌందర్య వదిన నిర్మల, ఆమె కొడుకు సాత్విక్ తో ఉంటోంది.  సౌందర్య భర్త రాజు మరో వివాహం కూడా చేసుకున్నారు. ఇప్పుడు సౌందర్య సంపాదించిన రూ.50కోట్ల ఆస్తి కోసం వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో సౌందర్య తల్లి, ఆమె భర్త రాజు కలిసి ఓ వర్గం కింద తయారయ్యారు. ఆమె వదిన, మేనల్లుడు మరో వర్గం. వీరి ఆస్తి గొడవలు కోర్టు వరకు వెళ్ళాయి. వివరాల్లో కెళ్తే సౌందర్య బెంగుళూరులో ఉన్న తన గృహంలో అల్లుడు సాత్విక్ కు కూడా భాగముందని రాసిందట. ఇప్పుడు తన భాగం తనకు కావాలని సాత్విక్ అడగడంతో సౌందర్య తల్లి అడ్డుపడిందట. వెంటనే అతను కేసు పెట్టాడు. అలా ఆమె ఆస్తి విషయంలో వివాదాలు చెలరేగాయి. ఆస్తి ఓ వైపుంటే ఆమెకు సంబంధించిన బంగారు, వెండి, వజ్రపు ఆభరణాల సంగతి కూడా తేలాల్సి ఉంది. సౌందర్య పలు షాప్ ఓపెనింగ్ లకు వెళ్ళినప్పుడు ఆమెకు పలు ఆభరణాలు కానుకగా వచ్చేవని, వాటన్నింటి ఆమె తల్లి దగ్గరుంచుకుందని సన్నిహితులు అంటున్నారు. సౌందర్య చనిపోవడానికి ముందే తన ఆస్తికి సంబంధించిన వివరాలను వీలునామా రాసిందని కొందరంటున్నారు. కానీ మరణాన్ని కలలో కూడా ఊహించని ఆమె అలాంటివి రాసే అవకాశమే లేదని ఆమె వదిన నిర్మల వాదన. నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: