జూనియర్ 50 కోట్ల డీల్ !

Seetha Sailaja
రాబోతున్న ఎన్నికలలో జూనియర్ ప్రాముఖ్యత తగ్గి ప్రచారానికి దూరంగా ఉండటంతో సినిమాలలో కూడ జూనియర్ హవాకు బ్రేక్ పడుతుందా అని వార్తలు రాస్తున్న విమర్శకుల నోటికి తాళం వేయబోతున్నాడు ఎన్టీఆర్. ఎపి హెరాల్డ్ కు అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ప్రముఖ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ సినిమా జూనియర్ తో 50 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి సిద్దంగా ఉంది అనే వార్తలు వస్తున్నాయి.  రిలయన్స్ సినిమా అధినేత అనీల్ అంబానీ ఇక వరసగా తెలుగులో టాప్ హీరోలందరితోను స్పీడ్ గా సినిమాలు చేయాలని ఉద్దేశ్యంతో ఈ ఆఫర్ జూనియర్ కు ఇచ్చినట్లుగా టాక్. ఇప్పటికే ‘దేవుడు చేసిన మనుషులు’, ‘భాయ్’, ‘సాహసం’ లాంటి సినిమాలను తీసి చేతులు కాల్చుకున్న రిలయన్స్ సినిమాకు పవన్ ‘అత్తారింటికి దారేది’ విపరీతమైన పేరు, డబ్బు రెండు తెచ్చి పెట్టింది. మళ్ళీ అటువంటి టాప్ హిట్ కోసం రిలయన్స్ సంస్థ క్రియేటివ్ టీమ్ ఇప్పటికే కధకు సంబంధించిన ప్రాధమిక చర్చలు పూర్తి చేసి జూనియర్ సూచనతో ఒక టాప్ డైరెక్టర్ మరొక టాప్ హీరోయిన్ తో అతిత్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఎన్నికల ఫలితాలు ఇంకా రాకుండానే మే నెలలో ఈ సినిమాకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసి జూనియర్ టాలీవుడ్ లో తన సత్తాని చాటడానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పారితోషికం జూనియర్ కెరియర్ లోనే అత్యధిక పారితోషికంగా రిలయన్స్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: