ఓవర్సీస్ లో సాహోలో సగం కూడా చేయలేకపోయింది సైరా
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఈ సినిమాను 25 కోట్ల కు అమ్మాలనుకున్నాడు నిర్మాత రామ్ చరణ్. అయితే సాహో అక్కడి బయ్యర్ల కు ఇచ్చిన షాక్ తో అంత ధర పెట్టి కొనడానికి ఎవరు ముందుకు రాలేదు దాంతో చరణ్ వెనక్కు తగ్గి 20కోట్ల కు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అయితే అప్పటికి ఎవరు సాహసం చేయకపోవడంతో చివరికి 18కోట్లకు వచ్చాడు. తాజాగా అదే రేటుకు ఈ హక్కులను ఫార్ ఫిలిమ్స్ దక్కించుకుంది.
ఇంతకుముందు ఈసంస్థ సాహో ను 42 కోట్ల కు దక్కించుకొని ఓవర్సీస్ లో విడుదలచేసింది. అలా సైరా ఓవర్సీస్ లో సాహో లో సగం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేయలేకపోయింది. అయితే ఒక రకంగా ఇది మంచికే అనుకోవాలి. తక్కువకు అమ్మడం వల్ల రామ్ చరణ్ కొంచెం నష్టపోయిన ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వస్తే అక్కడ బయ్యర్లు లాభపడతారు. ఓవరాల్ గా సైరా ప్రీ రిలీజ్ విషయంలో 200కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలకానుంది.