మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే టీజర్ రూపంలో ముంబైలో ఈవెంట్ ను నిర్వహించింది. ఇండియాలోని ముఖ్యమైన నగరాల్లో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, చెన్నై తో పాటు కర్ణాటక, కేరళలో కూడా ఈ వేడుకలు నిర్వహించాలని యూనిట్ నిర్ణయించింది. సైరా చారిత్రాత్మక సినిమా. చరిత్ర మర్చిపోయిన ఓ యోధుడిని గుర్తు చేస్తున్న సినిమా.
ఇలాంటి సినిమాల్లో నటించడం ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోరు. ప్రమోషన్ విషయంలో కూడా తప్పకుండా సహకరిస్తుంటారు. యూనిట్ తో పాటు నటీనటులు కూడా ప్రమోషన్స్ కు వస్తేనే నిండుదనం కనిపిస్తుంది. ముంబైలో జరిగిన టీజర్ ఈవెంట్ కు అమితాబ్ హాజరుకాలేకపోయారు. కొన్ని పర్సనల్ కారణాల వలన అయన హాజరుకాలేకపోయి ఉండొచ్చు. ఈ వేడుకలకు హీరోయిన్ నయనతార కూడా హాజరు కాలేదు.
అన్నింటికంటే సైరాసినిమాకు ఇదే ఒక మైనస్ పాయింట్ కాబోతున్నది. ఎందుకంటే, ఇందులో సైరా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే పేరున్నది. సౌత్ లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలో తీసుకున్నారు. ఎన్నో కండిషన్స్ పెట్టింది. వాటన్నింటికి కూడా యూనిట్ ఒకే చెప్పింది. ప్రమోషన్స్ విషయంలో నయనతార ఖచ్చితంగా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ కోసం తనకు దూరంగా ఉంటానని ఇప్పటికే చెప్పింది.
చెప్పినట్టుగానే ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నది. మెగాస్టార్ ఆమెకు ప్రమోషన్స్ తో పాల్గొనే విధంగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, ఆమె పాల్గొంటుందా అన్నది డౌట్ గా మారింది. హీరోయిన్ లేకుండా ప్రమోషన్ అంటే సినిమాకు కొంత మైనస్ అని చెప్పాలి. అందులోను నయనతార వంటి స్టార్ హీరోయిన్ లేకుండా సినిమాను ప్రమోషన్ చేయడం అంటే కొంత ఇబ్బందే. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.