పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పక్కా మాస్ ఎంటర్టైర్ గా తెరకెక్కిన ఈ మూవీకి తెలంగాణా ఏరియాలో మంచి వసూళ్లు వస్తున్నాయి. నిన్నటి రోజున అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి.
ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ అంతగా లేదని క్రిటిక్స్ రావడం ఇబ్బందికరమైన అంశం అనే చెప్పాలి. మాస్ ఎంటర్టైనర్ కావడం వలన సినిమాకు కలెక్షన్లు వస్తాయని పూరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక సినిమా చూసిన తరువాత, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి పూరి గురువుగారు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
కంగ్రాట్స్ చెప్తూ... సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సంతోషాన్ని పంచుకోవాలి. వీలైనంత త్వరగా ఇస్మార్ట్ కు సీక్వెల్ ప్రకటించు అని చెప్పి ట్వీట్ చేశారు. దీనికి పూరి రిప్లై ఇచ్చాడు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ పేరుతో రిజిస్టర్ చేయించినట్టు చెప్పాడు పూరి.
వావ్ సూపర్ అని పూరి రిప్లై ఇచ్చాడు. సినిమా రిలీజ్ అయ్యి ఒక్కరోజే అయ్యింది. అంతలోనే పూరిని దీనికి సీక్వెల్ చేయమని అడగడం ఏంటి.. దానికి పూరి డబుల్ ఇస్మార్ట్ అని టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు చెప్పడం ఏంటి.. సినిమా ఎలా ఉంది అనే విషయం తెలియాలంటే ఇంకా సమయం పడుతుంది. అంతలోనే తొందరపడి ఇలా ఎందుకు రెస్పాండ్ అయ్యారో అర్ధం కావడం లేదు.