ఏం మాయ చేశావే సినిమాతో సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం
అయ్యింది. ఆ పరిచయంతోనే చైతూతో ప్రేమలో పడింది. మనసులు కలవడానికి మనం
సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తరువాత పెళ్లి అనే మజిలీతో రీల్
లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోకి అడుగుపెట్టారు.
టాలీవుడ్
బెస్ట్ సెలెబ్రిటీ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకటి. మూవీ విషయంలోనే కాకుండా
కెరీర్ విషయంలో వీరి ప్లానింగ్ సూపర్ గా ఉంటుంది. చైతు సమంతలు సినిమాలపై
దృష్టిపెడుతూనే.. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ పై కూడా ఓ లుక్కేశారు.
భవిష్యత్తులో స్టూడియోకు సంబంధించిన విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత వీళ్లదే
కావడంతో ఇప్పటి నుంచే దానిపై దృష్టిపెట్టారు.
సినిమాల
విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమా చేసింది. ఈ మూవీ జులై 5 వ
తేదీన రిలీజ్ కాబోతున్నది. సమంత సినిమాలను ముందుగానే చూసే చైతు.. ఓ బేబీ
సినిమా చూశాడట. సినిమాను చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేసినట్టు సమంత
చెప్పింది. భర్త చైతు కళ్ళల్లో ఆ ఆనందం చూసి శ్యామ్ ఏడ్చేసిందట.
కొరియన్
మూవీ మిస్ గ్రానీ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో రావు రమేష్,
రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య తదితరులు నటిస్తున్నారు. నందిని రెడ్డి
దర్శకత్వం వహించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.