హీరోయిన్ పై సీరియస్ అయిన పూరి జగన్నాథ్..?
ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామ్ తో తీస్తున్న సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ తన పాస్ పోర్ట్ పోగొట్టుకున్నట్లు..దీంతో షూటింగ్ మొత్తం క్యాన్సల్ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. అంతేకాకుండా తన పాస్ పోర్ట్ కోసం హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి.
అయితే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ మరోపక్క తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ సరిగ్గా విదేశాలకు వెళ్లాల్సిన కీలక సమయంలో సినిమాలో కీలక ఎపిసోడ్ కోసం షూటింగ్ కి అన్నీ రెడీ అయిన క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ పాస్ పోర్ట్ పట్ల అజాగ్రత్తగా వ్యవహరించడం పై పూరి జగన్నాథ్ సీరియస్ అయినట్లు ఫిలింనగర్ టాక్.