తమిళ హీరోతో కీలక పాత్రలో మోహన్ బాబు..!

siri Madhukar
టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. ఆనాటి మేటి నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసిన ఎన్నో విభిన్నమై పాత్రల్లో నటించారు.  కేవలం నటుడిగానే కాకుండా..దర్శక, నిర్మాత,విద్యావేత్తగా కొనసాగుతున్నారు.  రాజకీయాల్లో కూడా ఆయన రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.  హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర  వేశారు మోహన్ బాబు. 

ఆ మద్య  హీరోగా, విలన్ గా  నటించిన ‘గాయత్రి’ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ మూవీలో ఎస్వీఆర్ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం మోహన్ బాబు ఒక తమిళ సినిమాకు సైన్ చేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.  సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో మోహన్ బాబు పవర్‌ఫుల్  పాత్రలో కనిపించబోతున్నారట.  వెంకటేశ్‌ హీరోగా ‘గురు’ మూవీ తెరకెక్కించిన సుధ తెలుగమ్మాయి.  సూర్య హీరోగా ఓ మూవీ చేయడానికి సుధ సన్నాహాలు చేస్తున్నారు.  

ఈ సినిమా   కథ రాసుకున్నపుడు  ముఖ్యమైన పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందని అనుకుందట. ఇదే విషయాన్ని సూర్యకు కూడా చెప్పిందట.  వెంటనే అలాంటి సీనియర్ నటుడితో నటించడం చాలా హ్యాపీ అని సూర్య చెప్పారట.   ఇటీవల మోహన్‌బాబుకు సుధ కథ చెప్పడం, ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పటివరకూ కనిపించన విలక్షణ పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం.  తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రూపొందించనున్నట్టుగా తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: