‘మహర్షి’పై మహేష్ క్లారిటీ ఇచ్చాడు!

siri Madhukar
గత యేడాది కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’బ్లాక్ బస్టర్ అయ్యింది.  ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేర్చింది.  ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డె నటిస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమాకు సంబంధించిన చిన్న టైటిల్ టీజర్, పోస్టర్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ లేవు.  అంతే కాదు ఈ సినిమా పై మొదటి నుంచి రక రకాల రూమర్లు కూడా పుట్టుకు వస్తున్నాయి.  రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో కాంట్రవర్సీలు నెలకొంటున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మహేశ్ బాబు .. అల్లరి నరేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.   'మహర్షి' సినిమా వాయిదా పడుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ లో సినిమా వచ్చే ఛాన్స్ లేదని, జూన్ కి వెళ్లేలా ఉందని అన్నారు.

అయితే ఈ వార్తలు తెలుసుకున్న మహేష్ బాబు కాస్త సీరియస్ అయినట్లే కనిపిస్తుంది. దర్శక నిర్మాతలతో ఈ విషయాన్ని గురించి చర్చించి, వెంటనే క్లారిటీ ఇవ్వమని చెప్పాడట. దాంతో దిల్ రాజు రంగంలోకి దిగిపోయి, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా ఏప్రిల్ 25కి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో 'మహర్షి' విడుదల వాయిదాపై వస్తోన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.  
An update about #Maharshi...

Shooting part will be completed by March 15th except for 2 songs. Post Production is going on simultaneously in full swing.

All set for April 25th Release.@urstrulyMahesh @directorvamshi@hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1 #SSMB25

— Sri Venkateswara Creations (@SVC_official) February 27, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: