పవన్ భవిష్యత్ ను వర్మ చెవిలోచెప్పిన పోతులూరి వీరబ్రహ్మ స్వామి !

Seetha Sailaja
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై చేసిన లేటెస్ట్ ట్విట్ సంచలనంగా మారింది. కోట్లాది మంది మహా మనీషిగా భగవత్ స్వరూపుడిగా భావిస్తున్న పోతులూరి వీరబ్రహ్మం గారు తన కలలో కనిపించి ఒక రహస్యం తన చెవిలో చెప్పారు అంటూ చేసిన ట్విట్  అత్యంత ఆసక్తి దాయకంగా మారింది. ‘బ్రహ్మంగారు నాకు చెవిలో చెప్పింది పవన్ కళ్యాణ్  గెలిస్తే ఏపీ సీఎం అవుతాడు గెలవకపోతే గెలిచిన సీఎం కి మొగుడవుతాడు. తధాస్తు’ అంటూ చేసిన ట్విట్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. 

దీనితో షాక్ అయిన పవన్ అభిమానులు కొందరు వర్మ పై ఆగ్రహిస్తూ ‘మళ్లీ పవన్ కల్యాణ్ మీద పడ్డావు అంటే పవన్ ఫ్యాన్స్‌ ను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పబ్లిసిటీకి వాడుకుంటున్నావన్న మాట’’ అంటూ రివర్స్ కామెంట్స్ పెట్టారు.  ఇదే సందర్త్భంలో మరికొందరు పవన్ అభిమానులు మాట్లాడుతూ  ‘తమరు మెలకువలో ఉన్నప్పుడు చెప్పారా మందులో ఉన్నప్పుడు చెప్పారా?’ అంటూ వర్మను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ కామెంట్స్ ఇలా హడావిడి చేస్తూ ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ వేదాంత ధోరణితో కర్నూల్ జిల్లాలో అన్న కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాను అధికారం కోసం రాజకీయాలలోకి రాలేదనీ అధికారం లేకున్నా ప్రజాసేవలో కొనసాగుతాను అని కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పై అనేక చర్చలు జరుగుతున్నాయి. 

ప్రజలకు సేవ చేయాలి అంటే ఒక సామాజిక సేవా సంస్థను పెట్టి సేవచేయవచ్చు అనీ కానీ రాజకీయాలలో మార్పు తీసుకు వస్తాము అంటూ పార్టీ పెట్టి సినిమాలకు దూరమైన పవన్ నోటివెంట ఇలాంటి వేదాంతం వస్తే అతడికి అభిమానులు అయినా ఓట్లు వేస్తారా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు వర్మ లాంటి వ్యక్తులు ఎందరో పవన్ పై సెటైర్లు వేస్తున్నా పట్టించుకోకుండా జనం మధ్య పవన్ తిరుగుతూ ఉన్నా ఎక్కడో ఎన్నికల వ్యూహాలలో పవన్ తప్పు చేస్తున్నాడు అంటూ అతని అభిమానులు కూడ బాధ పడుతున్నారు..  
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: