ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని ముంబైలోని ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్(ఎహెచ్ఐ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 62 ఏళ్ళ బ్రహ్మానందం ఆరోగ్యం విషయంలో గత నాలుగు రోజులుగా అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మానందానికి ఆదివారం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ముంబై లోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్(ఎహెచ్ఐ) ఆసుపత్రిలో చేర్పించారు.
బ్రహ్మానందం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తనయులు ఆదివారం హాస్పిటల్ కు తీసుకెళ్ళారని.. టెస్టులు అన్ని చేసిన తర్వాత బైపాస్ చేయాలని వైద్యులు సూచించడంతో సోమవారం నాడు సర్జరీకి ఏర్పాట్లు చేశారని సమాచారం. సర్జరీ విషయం తెలిసిన తర్వాత అయన అభిమానులు.. ఫిలిం ఇండస్ట్రీలో అయనతో పనిచేసినవారు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాద్వారా మెసేజులు పెడుతున్నారు.
1985 లో 'అహ నా పెళ్ళంట' సినిమా ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్రహ్మానందం తెలుగులో వెయ్యికి పైగా సినిమాలలో నటించారు. అత్యధిక చిత్రాలలో నటించినందుకు ఆయన గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. అలాగే పద్మశ్రీ బిరుదును కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. తాజాగా ఆలల ఎంటీయర్ కధానాయకుడు మూవీలో రేలంగి పాత్రను నటించారు.