ప్రస్థుతం నాగబాబు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ రోజుకు ఒక్క వీడియో పెడుతూ ఎన్టీఆర్ బయోపిక్ హడావిడిలో ఉన్న బాలకృష్ణకు అసహనాన్ని కలిగించే విధంగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనితో నందమూరి మెగా అభిమానుల వార్ తార స్థాయికి చేరుకుంది.
ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఈవ్యవహారంలో తల దూర్చి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘కామెంట్లు చేయడంలో నన్ను మించిపోయారనే నా బాధ ఒకవైపు స్టార్ బ్రదర్స్ను సమర్థించడంలో సూపర్స్టార్ అయిపోయారనే ఆనందం ఒకవైపు ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు. నాగబాబు గారూ హ్యాట్సాఫ్. మీ సోదరులను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం’ అంటూ వర్మ చేసిన ట్వీట్ ఈవివాదానికి మరింత వేడిని రగిలిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈరోజు బాలకృష్ణ తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ తో బయటకు వస్తున్న సందర్భంలో ఒక మీడియా ప్రతినిధి నాగబాబు వ్యాఖ్యల పై అడిగిన ప్రశ్నకు చాల వ్యూహాత్మక సమాధానం ఇచ్చాడు. ‘ఆలెక్కలు ఇక్కడ ఎందుకు’ అంటూ ఈవిషయమై తాను తరువాత స్పందిస్తాను అన్న సంకేతాలు ఇచ్చాడు బాలయ్య.
తెలుస్తున్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీలోని అనేకమంది ప్రముఖులు నాగబాబు కామెంట్స్ పై ఎదురు దాడి చేయాలని నిశ్చయించుకున్నా తెలుగుదేశం అధి నాయకత్వం సూచనతో ప్రస్తుతం ఆలోచనలు విరమించుకున్నట్లు టాక్. నాగబాబు విషయాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి కానీ భావోద్వేగాలతో కాదు అని ఆ తెలుగుదేశ అధినాయకుడు సలహాలు ఇస్తున్నట్లు టాక్..