ఆ పార్టీకే ప్రచారం చేస్తానంటున్న కమెడియన్ పృథ్వీ..?

Chakravarthi Kalyan

రాజకీయాలు, సినిమా విడదీసి చూసే పరిస్థితి లేదు. చాలా మంది నటులు రాజకీయాల్లోనూ రాణించిన సంగతి. ఇప్పుడు చిన్నా చితకా నటులు కూడా ఏదో ఒక పార్టీవైపు మరలుతున్నారు. గతంలో ఎక్కువగా నటులు టీడీపీ వైపు మొగ్గేవారు. ఇప్పుడు వైసీపీ కూడా ఆ పార్టీకి దీటుగానే సినీ నటులను ఆకర్షిస్తోంది.


ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ నవ్వులు పూయించిన పూయిస్తున్న కమెడీయన్ పృథ్వీ కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడు. పృథ్వీకి మొదటి నుంచి రాజకీయాలపై ఇంట్రస్ట్ ఉందట. కాకపోతే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదట.



తాతను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని అంటున్నాడు కమెడియన్ పృథ్వీ. అంటే తాను ఎమ్మెల్యేగా ఎక్కడా పోటీ చేయను అంటున్నాడు. కాకపోతే వైఎస్సార్ పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం మాత్రం చేస్తాడట. అంతేకాదు. సినిమాలు- రాజకీయాల విషయంలో తాను నటుడు బాలకృష్ణను ఫాలో అవుతానంటున్నాడు.



బాలయ్య కూడా నటన వేరు, రాజకీయాలు వేరు. ఈ రెంటినీ కలిపి చూడవద్దని చెబుతుంటారు అంటున్నారు పృధ్వీ. బాలయ్య ఎమ్మెల్యే అయినా కూడా రాజకీయాల వల్ల సినిమాలకూ ఏనాడు ఇబ్బంది కలగలేదని వివరించారు పృథ్వీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: