దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత!

siri Madhukar
బాలీవుడ్ లో విషాదం నెలకొంది.  ఒకప్పుడు హర్రర్ సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించి ప్రముఖ దర్శకులు తులసి రామ్ సే కన్నుమూశారు.  గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.  అకస్మాత్తుగా తులసి రామ్‌సేకు ఛాతి నొప్పి రావడంతో ఆయన కుమారుడు ముంబైలోకి కోకినాబెన్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం తెల్లవారు జామున ఛాతి నోప్పి తీవ్రం కావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి తుది శ్వాస విడిచారు. 

ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఆయన కుమారుడు దీపక్ తెలియజేశారు.  ఎఫ్‌యూ రామ్ సే ఏడుగురు కుమారుల్లో తులసి రామ్ సే ఒకరు. తులసి రామ్ సే తీసే చిత్రాలకు ఆయన ఆరుగురు సోదరులు కూడా వివిధ విభాగాల్లో పనిచేశారు.  సినిమా ఫీల్డ్ లో ఆయన కుటుంబం కొనసాగుతూ వస్తుంది.  ఆజానుభాహుడిగా ఉండే తులసి రామ్ సే హర్రర్ సినిమాల్లో చూస్తే అప్పట్లో ప్రక్షకులకు వెన్నుల్లో వణుకు పుట్టేదట. 

తులసీరామ్ సే హార్రర్ సినిమాలతోపాటు 90లలో పాపులర్ అయిన జీ హార్రర్ షో టీవీ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.  తులసీ రామ్‌సే వీరన, పురాణీ హవేలీ, బంద్ దవాజా, పురానా మందిర్  హర్రర్ సినిమాల్లో నటించి దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: