నానీని సమస్యలలోకి నెట్టేసిన మహర్షి !

Seetha Sailaja
ప్రిన్స్ మహేష్ తన 25వ సినిమాగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాలో రిషి పాత్రను పోషిస్తూ అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్తగా కనిపించ బోతున్నాడు. ఈసినిమా కథలో అమెరికాలో ఉండే మహేష్ తన చిన్ననాటి మిత్రుడు అల్లరి నరేష్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించే నిమిత్తం ఇండియాకు వచ్చి ఇక్కడి రైతుల పరిస్తుతులను చూసి వారికి ఏదైనా సాయం చేయాలి అన్న ఉద్దేశ్యంతో చేసే ప్రయత్నాల చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుంది.

మహేష్ మన తెలుగు రాష్ట్రాలలోని రైతుల కష్టాలు చూసి చలించిపోయి వారికి ఆర్గానిక్ వ్యవసాయం గురించి తెలిసి వచ్చేలా సలహాలు ఇవ్వడమే కాకుండా రైతులు బాగుంటేనే ఇండియా బాగుంటుంది అన్న సందేసంతో ‘మహర్షి’ సినిమా కథ నడుస్తుంది. ఇప్పటికే చాల భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈసినిమా కథ నానీకి అనుకోని సమస్యగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారంమేరకు నాని మహేష్ తో అనేక సినిమాలు నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థకు ఒక సినిమాను చేస్తానని ఒప్పుకుని అడ్వాన్స్ కూడ తీసుకున్నాడు. ఈసినిమాకు కొత్త దర్శకుడు కిషోరుడు దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈసినిమా కథ కూడ అంతా రైతుల చుట్టూ ఆర్గానిక్ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని సమాచారం. అయితే ఇప్పుడు ఇదే కథతో మహేష్ ‘మహర్షి’ వస్తున్న నేపధ్యంలో ఈ విషయం తెలుసుకుని నాని తాను ఈసినిమాను చేయలేనని ఈమూవీ దర్శక నిర్మాతలకు చెప్పినట్లు టాక్. 

వాస్తవానికి నాని నటిస్తున్న ‘జెర్సీ’ తరువాత మొదలు కావలసి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త కథ వెతికే పనిలో పడటంతో నాని 14 రీల్స్ మూవీ సంస్థకు సినిమా చేసే అవకాసం ఇప్పట్లో లేదు అని అంటున్నారు. అయితే కొత్త దర్శకుడు నిరాశ చెందకుండా మరో మంచి కథ తీసుకు వస్తే తాను తప్పకుండా నటిస్తానని కిషోరుడుకు మాట ఇచ్చినట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: