బెల్లంకొండ వర్ధమాన నటీమణులకు నిజంగా బంగారుకొండేనా!


టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగానే ఓ సెన్సేషన్. కొత్త కుర్రాడు అయినా, టాప్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ల కారణంగా ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా హిట్ అనిపించుకో లేదు కానీ, ప్రముఖ హీరోయిన్లతో ఈ హీరో జోరు ఏ మాత్రం తగ్గలేదు.

ఇప్పుడు కూడా పూజా హెగ్డే లాంటి క్రేజీ భామ తోనే మూవీ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటికే సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ ఆడేసిన శ్రీనివస్ కొత్త హీరో అయినా ఇతడితో మాత్రం రొమాన్స్ చేసేందుకు ఆ రేంజ్ ఉన్న హీరోయిన్స్ ఒప్పుకోవడానికి అసలు రహస్యం ఏమిటో అంతుపట్ట ట్లేదు. అయితే సహజంగా అందరు చెప్పే కారణం, పారితోషికం అంటే రెమ్యూనరేషన్ అనే విషయం చెప్పుకోవాల్సిందే.

సాధారణంగా టాప్ హీరోయిన్స్ తీసుకునే పారితోషికం కంటే ఇబ్బడి ముబ్బడి గా పుచ్చుకుని మరీ బెల్లంకొండ సినిమాల్లో నటిస్తున్నారు ఈ వయ్యారి భామలు. అలాగని డబ్బులు భారీగా ఆఫర్ చేసినంత మాత్రాన, ఎవరితో పడితే వారితో, చేసేందుకు వీరు అంగీకరించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తాజాగా ఒక మంత్రి తన కొడుకును హీరో చేసేందుకు ప్రయత్నించి, రకుల్ ను అడిగారట. ఏకంగా మూడు కోట్ల రూపాయిల పారితోషికం ఇస్తామని, అది కూడా వన్ సింగిల్ ట్రాన్సాక్షన్ తో క్లియర్ చేస్తామని ఆఫర్  చేశారట. అయినా సరే, ఏ మాత్రం తొణకని రకుల్ ప్రీత్. ఆ మినిస్టర్ కొడుకు పక్కన నటించనని తేల్చేసిందట. ఇలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్న క్రేజీ హీరోయిన్స్, మరి బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన చేయడానికి కారణం, బహుశా, అతని తండ్రి సురేష్ ప్రఖ్యాత నిరాత కావడమేనా? అనే టాక్ చిత్రపురిలో ప్రతిద్వనిస్తుంది. 

అంతేకాదు బానర్ పేరు ప్రతిష్ఠ భవిష్యత్ లో కనిపించే మెరుగైన అవకాశాలు ప్రస్తుతం లభించే ఆకర్షణీయమైన పారితోషికం ఇవన్నీ ప్రాధాన్యత వహిస్థాయి. కాని తండ్రి మంత్రైతే పెద్ద ప్రయోజనంగా గుర్తించరన్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: