ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు క‌న్నుమూత‌..!

Edari Rama Krishna
ఆ మద్య బాలీవుడ్ లో సంజయ్ దత్ నటించిన  ‘లగే రహో మున్నాభాయ్‌’ ఎంత గొప్ప హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.  ఈ చిత్రంతో సంజయ్ దత్ తన నట విశ్వరూపాన్ని చూపించారు.  సోషల్ మెసేజ్ తో కూడుకున్న ఈ చిత్రం సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ నటుడు హేము అధికారి (81) కన్నుమూశారు.ఊపరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయ‌న ముంబైలోని దాదర్‌లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాజ్‌కుమార్ హిరానీ-సంజయ్‌దత్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ లగే రహో మున్నాభాయ్‌లో కీలక పాత్ర పోషించారు.

అంతే కాదు పలు మరాఠీ చిత్రాల్లో కూడా హేము అధికారి నటించారు.  ఆయన ధ్యాస్ పర్యా, హరీశ చంద్రాచి ఫ్యాక్టరీ వంటి మరాఠీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హేము అధికారికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. హేము అధికారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: