పొలిటికల్ డ్రామా ను రిపీట్ చేస్తున్న విజయదేవరకొండ...!!!

murali krishna
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ని చేస్తున్నారు. ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం చేయబోతున్నారు.వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు.విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. పాటలు ఉండవు అని చెబుతున్న ఈ సినిమా సంగతి కాసేపు పక్కన పెడితే.. కొత్తగా విజయ్‌ రెండు సినిమాలు ఓకే చేశాడట. 'రాజావారు రాణీగారు' సినిమా ఫేమ్‌ రవికిరణ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందట. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత అంటున్నారు. ఈ సినిమాకే 'రౌడీ జనార్దన్‌' అనే పేరు ఫిక్స్ చేశారట.అలాగే నిర్మాత దిల్ రాజుతో విజయ్ రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది. మరి ఈ రెండు రిజల్ట్స్ కి విజయ్ ఈ సినిమాతో హిట్ అందుకొని గట్టి సమాధానం చెబుతారా లేదా చూడాలి. కాగా ఈ చిత్రాన్ని మే 9న విజయ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. పూజా కార్యక్రమాలతో ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట.పక్కా తెలంగాణ హీరోగా గుర్తింపు పొందిన విజయ్.. ఇప్పటిదాకా ఆంధ్ర, సీమ యాసల్లో డైలాగులు చెప్పింది లేదు. అతను రాయలసీమ భాష, యాసలో మాట్లాడితే ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విజయ్‌కి అది సూటవుతుందా అన్న సందేహాలున్నాయి కానీ.. మంచి పెర్ఫామర్ అయిన విజయ్ ఆ పనిని పర్ఫెక్ట్‌గానే చేస్తాడని ఆశించవచ్చు.ఇక ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని మొన్నటివరకు టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ పీరియాడిక్ డ్రామాలోనే పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందట. సింపుల్ గా చెప్పాలంటే.. రామ్ చరణ్ రంగస్థలం తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. కాగా పొలిటికల్ నేపథ్యంతో విజయ్ దేవరకొండ గతంలో ‘నోటా’ అనే సినిమాని చేశారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి పొలిటికల్ డ్రామాని టచ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: