చరణ్ ఫామ్ హౌస్ లంచ్ పై సందేహాలు !

Seetha Sailaja
‘రంగస్థలం’ తో తన మెగా పవర్ ను చూపెట్టి మళ్ళీ ట్రాక్ పైకి వచ్చిన రామ్ చరణ్ తన ఇమేజ్ ని బాలీవుడ్ లో కూడ పెంచుకోవడానికి చాల వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ వ్యూహాలలో భాగంగానే చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది మీడియా ప్రతినిధులకు తన ‘రంగస్థలం’ విజయాన్ని వివరిస్తూ అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఈనేపధ్యంలో చరణ్ లేటెస్ట్ గా ఒక ప్రముఖ బాలీవుడ్ మూవీ క్రిటిక్ కు హైదరాబాద్ లోనే తన ఫామ్ హౌస్ లో ఇచ్చిన లంచ్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఆప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కు చరణ్ భాగ్యనగరంలో రాచమర్యాదలు చేయడమే కాకుండా అతడికి చరణ్ హోస్ట్ చేసిన లంచ్ లో ఆంధ్రా తెలంగాణ వంటలను రుచి చూపిస్తూ అనేక ప్రముఖ డిషస్ తో కూడిన విందు భోజనం ఆ బాలీవుడ్ ప్రముఖుడుకి చరణ్ హోస్ట్ చేయడంతో ఆ ఫిలిం క్రిటిక్ ఫిదా అయినట్లు సమాచారం.

‘రంగస్థలం’ ఘన విజయం తరువాత ఈమూవీ కలక్షన్స్ ను హైలెట్ చేస్తూ బాలీవుడ్ మీడియా చరణ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ వార్తలు ప్రచురిస్తోంది. అంతేకాదు అనేక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్స్ కూడ ‘రంగస్థలం’ మూవీ సృస్టించిన కలక్షన్స్ మ్యానియా పై ఆసక్తికర కథనాలను ఇప్పటికీ ప్రసారం చేస్తోంది. 

ఈమూవీ విడుదలై త్వరలో 50 రోజులు పూర్తి కాబోతున్న సందర్భంలో ఇంకా ఈసినిమా ప్రమోషన్ ను చరణ్ బాలీవుడ్ మీడియాలో కొనసాగించడం వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు. ‘బాహుబలి’ తో ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఎదిగిన నేపధ్యంలో అదేవిధంగా ‘రంగస్థలం’ తో తన ఇమేజ్ ని బాలీవుడ్ లో పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా చరణ్ ఇలా బాలీవుడ్ మీడియా ప్రతినిధులకు అదేవిధంగా బాలీవుడ్ మూవీ క్రిటిక్స్ కు ఇలా రకరకాల వెరైటీ డిషెస్ తో తన ఫామ్ హౌస్ లో లంచ్ ని ఇస్తూ అందర్నీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: