నా కల నిజమైతే బాగుండు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో గతంలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే ఫృథ్వి గత కొంత కాలంగా మంచి ఫామ్ లో ఉన్నారు.  థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకున్నే ఫృథ్వి తన మానరీజం..పేరడీ కామెడీతో బాగా పాపులర్ అయ్యారు.  ఆ మద్య ఓ ఒకటీ రెండు సినిమాల్లో హీరోగా కూడా వచ్చాడు. ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఎన్నో వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో కమెడియన్ ఫృథ్వి తనదైన స్టైల్లో స్పందించారు.

మొన్నీ మధ్య తెల్లవారుజామున తనకు ఓ కల వచ్చిందని, ఆ కల నిజమైతే బాగుంటుందని దేవుడిని కోరుకుంటానంటూ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నాడు.ఇంతకీ, ఆ కల ఏంటంటే.. ‘‘ఏం పృథ్వీ గారూ లెగండి.. లెగండి.. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు యువ నాయకులు కలిసిపోయారు’ అని నారద మహాముని నాతో అన్నారట.  ‘అయిబాబోయ్.. అని లేచేసరికి.. ఆరైంది..‘ఇది కల’ అనుకుంటూ.. షూటింగ్ కు టైమైందని లేచి వెళ్లిపోయా’ అని సరదాగా చెప్పారు. 

గత కొంత కాలంగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చాలా మనోవేదన కలిగించాయని..ఉద్యమాలు అంటూ వచ్చిన వారు పర్సనల్ విషయాల్లో తలదూర్చడం సబబు కాదని..ఎవరి మనసు నొప్పించినా..ఇండస్ట్రీల మొత్తం బాధపడుతుందని అన్నారు. వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ల భావజాలం ఒకేలా ఉందని, సమస్యలపై పోరాడాలనేదే వీరి అజెండా అని పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: